ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని లక్ష్యం: భారతీ ఇన్
గత సంవత్సరం కోల్ ఇండియా రూ.15,000 కోట్ల ఇష్యూ తర్వాత ఇదే అతిపెద్ద ఇష్యూ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ ఇష్యూ కనుక విజయవంతమైతే మరిన్ని పెద్ద ఇష్యూలకు రావడానికి మార్గం సుగమం అవుతుంది. పెద్ద ఇష్యూలు విజయవంతం సెంటిమెంట్ మరింత బలపడుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెకండరీ మార్కెట్పై ప్రయిమరీ మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ బాగా జోరుమీద ఉన్నందున ప్రయిమరీ మార్కెట్కు ఇష్యూలకు రావడం ఇదే మంచి తరుణమని వెల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ మమత్నా చెప్పారు.
భారతీ ఇన్ఫ్రాటెల్ ఇష్యూలో భాగంగా కంపెనీ సోమవారం 18 యాంకర్ ఇన్వెస్టర్ సంస్థల నుంచి రూ. 652 కోట్లను సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో మోర్గాన్ స్టాన్లీ, సుందరం ఎంఎఫ్, అలియన్స్ బెర్న్స్టీన్, కొలంబియా వాగ్నర్ ఉన్నాయి. ఈ సంస్థలకు 2.83 కోట్ల షేర్లను (ఇష్యూ పరిమాణంలో 15%) విక్రయించింది.
ఇష్యూకి ప్రైస్బ్యాండ్ రూ. 210-240 కాగా, షేరుకి రూ. 230 ధరలో యాంకర్ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. డిసెంబర్ 14తో ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 18.89 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది. తద్వారా రూ. 4,534 కోట్లవరకూ సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భారతీ ఇన్ఫ్రాటెల్ విషయానికి వస్తే భారతి ఎయిర్టెల్ అనుబంధ సంస్థ టవర్ల బిజినెస్ చేస్తోంది. కంపెనీలో భారతీ ఎయిర్టెల్కు 86% వాటా ఉంది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను విస్తరణకు ఇతర కంపెనీల కొనుగోళ్లకు వినియోగించనున్నట్లు భారతీ ఎయిర్టెల్ పేర్కొంది.
తెలుగు వన్ఇండియా