మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏమిటి?
దేశంలో నగదు నిర్వహణ, వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి నిర్ణయించడానికి ఏర్పరిచిన ఒక వ్యవస్థే మానిటరీ పాలసీ కమిటీ. ఇది రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు.
దేశంలో నగదు నిర్వహణ, వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి నిర్ణయించడానికి ఏర్పరిచిన ఒక వ్యవస్థే మానిటరీ పాలసీ కమిటీ. ఇది రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆర్బీఐ రేట్ల నిర్ణయం విషయంలో ఒక వ్యక్తి నిర్ణయం కంటే సమిష్టి నిర్ణయం మరింత బాగుంటుందనే నెపంతో దీన్ని ఏర్పరిచారు.
జూన్ 27,2016న ప్రభుత్వం ఆర్బీఐ చట్టాన్ని సవరించి మరి దేశంలో ద్రవ్య విధాన నిర్ణయాలకు కొత్తగా మానిటరీ పాలసీ కమిటీని మొదటిసారి ఏర్పాటు చేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ద్రవ్యోల్బణం, వృద్ది రేటు, నిరుద్యోగిత, బ్యాంకింగ్ స్థిరత్వం వంటివి వడ్డీ రేట్ల నిర్ణయంలో కీలక పాత్ర వహిస్తాయి. మానిటరీ పాలసీ కమిటీ తీసుకునే నిర్ణయం విషయంలో సందిగ్దం ఏర్పడితే ఆర్బీఐ గవర్నర్కు తుది ఓటింగ్ ద్వారా నిర్ణయాధికారం ఉంటుంది.